ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ సినిమాలో నటిస్తున్న హీరో ప్రభాస్ తదుపరి చిత్రాలుగా ప్రస్తుతం మూడు సినిమాలు లైన్లో వున్నాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్, `ఆదిపురుష్` సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ రెండు సినిమాలూ పట్టాలెక్కకముందే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. `కేజీఎఫ్`తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఓ సినిమా చేయబోతున్నాడు.
ఈ సినిమాకు `సలార్` అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. నాలుగు నెలలలో చిత్రాన్ని పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్టుతో యాక్షన్ ప్రధాన చిత్రంగా రూపొందే ఈ ‘సలార్’లో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తోంది.
ప్రభాస్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ భామను తీసుకోవాలని ప్రశాంత్ అనుకుంటున్నాడట. హాట్ బ్యూటీ, ఇన్స్టాగ్రామ్ క్వీన్ దిశా పటానిని హీరోయిన్గా తీసుకోవాలని ప్రశాంత్ భావిస్తున్నాడట. గతంలో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ చిత్రంలో దిశా పటాని నటించింది.