రాజకీయాల్లోకి వెళ్లి దాదాపు మూడేళ్ల విరామం తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ రిమేక్ గా వచ్చిన ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. పవర్స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన ‘వకీల్సాబ్’ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. తాజాగా ఈ చిత్ర ఓటీటీ విడుదల తేదీ గురించి అమెజాన్ ప్రైమ్ ప్రకటన చేసింది.
ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి ఈ సినిమాను 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్రాజు స్పష్టం చేశారు. కానీ థియేటర్లు మూతపడటం వల్ల కొంచెం ముందుగానే రిలీజ్ చేయాలని నిర్ణయించింది మూవీ యూనిట్.
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో థియేటర్లు మూసి వేసిన సందర్భంలో మళ్లీ బుల్లితెరపైనే ప్రేక్షకులు ఆదారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించగా.. ప్రధాన పాత్రల్లో ప్రకాశ్ రాజ్, నివేథా థామస్, అంజలి, అనన్య నాగళ్ల నటించారు.