Saturday, May 4, 2024
- Advertisement -

వెంకీతో పూరీ ‘జ‌న‌గ‌ణ‌మ‌న‌’

- Advertisement -

ద‌గ్గుబాటి వెంక‌టేశ్‌, ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ క‌ల‌వ‌నుంది. వీరిద్ద‌రి క‌లిసి ఓ సినిమా చేస్తున్నారు. వీరిద్ద‌రూ ఎప్పుడో చేయాల‌నుకున్నారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ద్ద ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్ల‌లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. మే నెలలో సెట్స్‌పైకి అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ త‌న కుమారుడు ఆకాశ్‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ‘మెహ‌బూబా’ సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర్వాత వెంక‌టేశ్ సినిమాను ప్రారంభించే అవ‌కాశం ఉంది.

అయితే ఈ సినిమాకు ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ పెట్టారు. ‘జ‌న‌గ‌ణ‌మ‌న‌’ అని టైటిల్ ఫిక్స్ చేశార‌ని స‌మాచారం. ఇది ఒక రాజ‌కీయ క‌థగా ఉండ‌నుంద‌ని స‌మాచారం. పైసా వ‌సూల్ ఫ్లాప్ త‌ర్వాత పూరీ క‌ష్టాల్లో ఉన్నాడు. ఈ సినిమాతో విజ‌యం కొట్టాల‌ని భావిస్తున్నాడు. అందుక‌నుగుణంగా క‌థ‌, క‌థ‌నాలు జ‌గ‌న్ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క‌థ‌ను వెంకీకి వినిపించ‌గా వెంట‌నే చేద్దామ‌ని చెప్పారంట‌. ఇక ఈ సినిమా వీరిద్ద‌రికీ కీల‌కం కానుంది. ఎందుకంటే వ‌రుస ఫ్లాపుల‌తో వెంకీ, పూరీ జ‌గ‌న్ స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఈ స‌మ‌యంలో ఈ సినిమా త‌ప్పినిస‌రిగా విజ‌యం సాధించాల్సిందే. లేదంటే వారి కెరియ‌ర్ ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉంది. మ‌నం కూడా ఆశిద్దాం వాళ్ల కెరియ‌ర్ నిల‌బ‌డాల‌ని.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -