Friday, May 17, 2024
- Advertisement -

విక్రమ్ మళ్ళీ ఎదో మాయ చేస్తున్నాడే!!

- Advertisement -

ఐ సినిమా తరువాత హీరో విక్రమ్ చేస్తున్న సినిమా  ‘ఇరు ముగన్’. ఆదివారం అర్ధరాత్రి ఈ సినిమా సంబధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా పోస్టర్ ఇప్పుడు తమిళ్‌నాడు లో తెగ హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో విక్రమ్ రెండు పాత్రలో కనిపించబోతున్నాడు అనే వార్తాలు వినిపిస్తున్నాయి.

అందులో ఒక్కటి హీరో పాత్ర కాగా ఇంకోటి విలన్ పాత్ర అని తెలుస్తుంది. ఈ పోస్టర్  సినిమాపై మరింత అంచనాలు పెంచెసింది. ప్రయోగాలు చేయడంలో విక్రమ్ ఎప్పుడు ముందు ఉంటాడు. మళ్ళీ ఈ సినిమాతో మరో  సారి  ప్రయోగం చేయబోతున్నాడు అంటుంది తమిళ పరిశ్రమ.

ఈ సినిమా విక్రమ్ సరసన నయనతార నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -