- Advertisement -
ఐ సినిమా తరువాత హీరో విక్రమ్ చేస్తున్న సినిమా ‘ఇరు ముగన్’. ఆదివారం అర్ధరాత్రి ఈ సినిమా సంబధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా పోస్టర్ ఇప్పుడు తమిళ్నాడు లో తెగ హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో విక్రమ్ రెండు పాత్రలో కనిపించబోతున్నాడు అనే వార్తాలు వినిపిస్తున్నాయి.
అందులో ఒక్కటి హీరో పాత్ర కాగా ఇంకోటి విలన్ పాత్ర అని తెలుస్తుంది. ఈ పోస్టర్ సినిమాపై మరింత అంచనాలు పెంచెసింది. ప్రయోగాలు చేయడంలో విక్రమ్ ఎప్పుడు ముందు ఉంటాడు. మళ్ళీ ఈ సినిమాతో మరో సారి ప్రయోగం చేయబోతున్నాడు అంటుంది తమిళ పరిశ్రమ.
ఈ సినిమా విక్రమ్ సరసన నయనతార నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు.