తమిళ స్టార్ విశాల్ తరుచు వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవలే నిర్మాతల మండలి, విశాల్కు మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో విశాల్ను అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు విశాల్. అయితే ఈసారి వివాదంతో కాకుండా ఓ శుభవార్తతో వార్తల్లో నిలిచారు విశాల్. విశాల్ తర్వలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అవును మీరు వింటుంది నిజమే. విశాల్ త్వరలోనే పెళ్లి చేసుకొబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన తండ్రి జీకే రెడ్డి స్వయంగా వెల్లడించారు.
అనీశా అనే యువతిని విశాల్ పెళ్లాడబోతున్నాడు. అనీశాది స్వస్థలం హైదరబాద్ అని తెలుస్తుంది. నిశ్చితార్థం పనులను ప్రారంభించే పనిలో విశాల్ కుటుంబం బిజీగా ఉందని సమాచారం. ఈ నిశ్చితార్థం వేడుక హైదరాబాద్లోనే జరగనుంది. గతంలో విశాల్ పెళ్లిపై చాలానే వార్తలు వచ్చాయి. విశాల్ ,నటుడు శరత్ కుమార్ కూతురైన వరలక్ష్మితో ప్రేమలో ఉన్నాడని ,ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. వరలక్ష్మి విశాల్తో ఓ సినిమా కూడా చేసింది. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోవడం దాదాపు ఖరారు అనుకున్నారు. కాని అలాంటిది ఏమి లేదని , మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని తెలిపారు ఈ జంట. తాజాగా విశాల్కు పెళ్లి సెట్ అవ్వడంతో వీరిద్దరు స్నేహితులే అని స్పష్టం అయింది.
- Advertisement -
విశాల్ పెళ్లి ఫిక్స్..ఎవరితోనో తెలుసా ?
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -