Thursday, May 2, 2024
- Advertisement -

హీరోయిన్ కళ్యాణి గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

- Advertisement -

హీరోయిన్ కళ్యాణి గుర్తుందా కదా.. రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘శేషు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కళ్యాణి. మలయాళ నటి అయిన కళ్యాణి అసలు పేరు కావేరి. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కళ్యాణిగా పేరు మార్చుకుంది. శేషు సినిమా తర్వాత ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

గ్లామార్ షో చేయకుండానే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. గ్లామర్ షో చేసే పాత్రలు వస్తే నో చెప్పేది. ‘కబడ్డీ కబడ్డీ’ ‘దొంగోడు’ ‘పెదబాబు’ ‘వసంతం’ ‘ఆపరేషన్ దుర్యోధన’ వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ‘సత్యం’ సినిమా దర్శకుడు సూర్య కిరణ్ ను పెళ్ళి చేసుకుంది కళ్యాణి. ఆ తర్వాత కూడా ‘లక్ష్యం’ ‘రక్ష’ వంటి చిత్రాల్లో నటించింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మున్నా సినిమాలో ప్రభాస్ చిన్నప్పుడు తల్లిగా కళ్యాణి అద్భుతంగా నటించింది.

అయితే కళ్యాణి తన భర్తతో కొన్నాళ్లు బానే ఉన్నారు. కానీ తరువాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు అని వార్తలు వచ్చాయి. కొన్నాళ్ళు ఈమె ఎటువంటి సినిమాల్లోనూ నటించలేదు. అయితే కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వస్తుంది.’లక్ష్యం’ ‘లెజెండ్’ ‘టాక్సీ వాలా’ ‘యాత్ర’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. ఇప్పుడు ఓ చిత్రానికి డైరెక్షన్ కూడా చేస్తుందని టాక్ నడుస్తుంది. మరి ఆ సినిమా ఏంటో తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -