పవన్ కళ్యాణ్ గొడవ ఇంతలా జరుగుతుండగా… రామ్ గోపాల్ వర్మ ఎందుకు స్పందించకుండా సైలంట్ గా ఉంటున్నాడు.ఇపుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ గొడవే. వర్మ ఒక్క ట్వీట్ పెడితే అదే ట్రెండింగ్ లోకి వస్తుంది. కాని ఆయన ఎందుకనో ఎవరో ఏదో చెబితే…వద్దన్నట్లుగా కామ్ గా ఉన్నాడు.దీనిని నెటిజన్లు కొందరు బాధగా ఫీలవుతున్నారు. అయితే వర్ సైలంట్ వెనుక ఓ వ్యక్తి ఉన్నాడని ఇపుడు బయటకు వార్తలు వస్తున్నాయి.
ఇవాంకా హైదరాబాద్ వచ్చిన నుంచి పవన్ టూర్ వరకు వర్మలో ఎలాంటి కదలిక లేదన్నది హార్డ్కోర్ అభిమానులు చెబుతున్నమాట. వున్నట్లుండి వర్మ సడెన్గా సైలెంట్ కావడం వెనుక నాగ్ ఉన్నాడనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. తన సినిమా అయ్యేవరకూ సోషల్మీడియాలో ట్వీట్స్కు ఫుల్స్టాప్ పెట్టమని వర్మకు నాగ్ సలహా ఇచ్చాడని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వర్మ సైలెంట్ అయ్యాడా? అన్న అనుమానం అభిమానుల్లో మొదలైంది.
‘గన్’ సినిమాపై వర్మ సీరియస్గా కాన్సంట్రేట్ చేస్తున్నాడని అంటున్నారు. వర్మ లేని సోషల్మీడియా చప్పగా ఉందనే సెటైర్లు పడిపోతున్నాయి. ఇక మూడు రోజులుగా పవన్కళ్యాణ్ టూర్పై ఎలాంటి ట్వీట్స్ చేయలేదు.బహుశ పవన్ టూర్ అయ్యాక సింపుల్ గా వర్మ ఓ స్టేట్ మెంట్ ఇవ్వొచ్చు.