Saturday, May 4, 2024
- Advertisement -

మాస్ మ‌హారాజ్ కోసం శ్రీనువైట్ల మాంచి స్టోరీ

- Advertisement -

మాస్ మ‌హారాజ్ కోసం శ్రీనువైట్ల మాంచి స్టోరీ

హాస్యం జోడించి క‌థ‌ను తిప్పితిప్పి చివ‌రికి ఓ కంచికి తీసుకురావ‌డంతో శ్రీనువైట్ల స్టైలే వేరు. శ్రీనువైట్ల సినిమా అంటే ప్రేక్ష‌కుల్లో హాస్య‌భ‌రిత సినిమాలుగా ముద్ర ప‌డ్డాయి. అయితే ప్ర‌స్తుతం శ్రీనువైట్ల ప‌రిస్థితి అయిపోయింద‌ని అంద‌రూ అంటున్నారు. ఇక సినిమాల‌కు రిటైర్ ప్ర‌క‌టించాల‌ని చెబుతున్న స‌మ‌యంలో ఇప్పుడు ఓ క్రేజీ క‌థ‌తో వ‌స్తున్నాడ‌ట‌. శ్రీనువైట్ల‌, ర‌వితేజ జోడీ విజ‌యవంతమైన కాంబినేష‌న్‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్  వ‌చ్చిన సినిమాలు ‘వెంకీ’, ‘దుబాయ్‌ శీను’ మంచి హిట్ట‌య్యాయి.

ఇప్పుడు ర‌వితేజ‌తోనే శ్రీనువైట్ల ఓ సినిమా చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ర‌వితేజ ట‌చ్‌చూసి చూడు సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఈ సినిమా త‌ర్వాత ‘నేల టికెట్‌’ అంటూ కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ర‌వితేజ న‌టిస్తున్నాడు. దాని త‌ర్వాత శ్రీనువైట్ల‌తో ర‌వితేజ న‌టించ‌డానికి అంగీక‌రించాడ‌ని స‌మాచారం. రవితేజ కోసం మంచి స్క్రిప్ట్‌ను శ్రీనువైట్ల సిద్ధం చేశారంట‌.

ఈ సినిమాను మైత్రీ మూవీస్‌ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకు విభిన్న‌మైన టైటిల్‌ను ఖ‌రారు చేశార‌ని స‌మాచారం. ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ అనే పేరు పరిశీలిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ర‌వితేజ ప‌క్క‌న నివేథ థామ‌స్ న‌టించ‌నుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -