Wednesday, April 24, 2024
- Advertisement -

పట్టపగలు నడి రోడ్డుపై వైద్య దంపతుల కాల్చివేత.. వీడియో వైరల్

- Advertisement -

దేశంలో ప్రస్తుతం కరోనా కల్లోలం సృష్టిస్తుంది. అయినా కొంత మంది నేరగాళ్లు తమ పనులు తాము చేసుకుంటూ పోతూనే ఉన్నారు. కామాంధులు మహిళలపై అత్యాచారాలు జరుపుతూనే ఉన్నారు. తాజాగా ఓ యువకుడు నడిరోడ్డుపై కారు ఆపి ఆందులో ఉన్న భార్యాభర్తలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం భరత్ పూర్ జిల్లాలో జరిగింది. ఘటనా స్థలంలోనే దంపతులు చనిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుదీప్ గుప్తా అనే వ్యక్తి వైద్యుడిగా పని చేస్తున్నాడు.

తన భార్య సీమా గుప్తాతో కలిసి కారులో వెళ్తుండగా ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి కారును అడ్డగించారు. దీంతో కారును ఆపిన డాక్ట‌రు విండో తెర‌చాడు. ఆ వెంట‌నే ఓ యువ‌కుడు బైకు దిగి తుపాకీ తీసి డాక్ట‌ర్ దంప‌తులపై కాల్పులు జ‌రిపాడు. ఆ స‌మ‌యంలో మ‌రో యువ‌కుడు బైకుపైనే కూర్చున్నాడు. కాల్పులు జ‌రిపిన యువ‌కుడు ఆ వెంట‌నే బైకు ఎక్క‌గా, మ‌రో యువ‌కుడు బైకును న‌డిపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సిసి కెమెరా ఆధారంగా నిందితులు అనూజ్, మహేష్ గా గుర్తించారు.

గతంలో డాక్టర్ సుదీప్ ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. మహిళతో మనస్పర్థలు రావడతో ఆమె తన ఐదేళ్ల బిడ్డతో ఇంట్లో ఉన్నప్పుడు సుదీప్ నిప్పంటించి పారిపోయాడు. ఈ ఘటనలో తల్లి, బిడ్డ సజీవదహనమయ్యారు. ఇది అగ్ని ప్రమాదం కాదని హత్యేనని పోలీసులు కేసు నమోదు చేసి సుదీప్, అతడి భార్య, అతడి తల్లిని జైలుకు తరలించారు. అన్యాయంగా తన అక్కను దారుణంగా హత్య చేసిన డాక్టర్ కుటుంబంపై కక్ష్య పెంచుకున్నాడు నింధితుడు. సుదీప్ హత్య చేశాయని సరైన సమయం కోసం ప్రణాళికలు వేస్తున్నాడు.

దంపతులు జైలు నుంచి విడుదలైన తరువాత సుదీప్ తన భార్యతో కలిసి కారులో వెళ్తుండగా అనూజ్ తన స్నేహితుడు మహేష్ సహాయంతో హత్య చేశాడు. కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ పాలనలో రాజస్థాన్ రాష్ట్రం నేరగాళ్ల రాజ్యంగా మారిందని బిజెపి నేత రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తన ట్విట్టర్ లో ఘాటు విమర్శలు చేశాడు.

Warch : ఆనందయ్య వైద్యం పై బాలకృష్ణ ఏమన్నాడో చూడండి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -