ఆంధ్రప్రదేశ్కు చెందిన అంతర్జాతీయ సైబర్ నేరస్థుడిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాట్రిమోనీ, క్రిప్టో కరెన్సీ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసిన ప్రసన్నకుమార్ను చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్కు చెందిన సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) బృందం చేపట్టింది.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రసన్నకుమార్ వివిధ నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి మాట్రిమోనీ వెబ్సైట్ల ద్వారా బాధితులతో పరిచయం పెంచేవాడు. అనంతరం పెట్టుబడుల పేరుతో క్రిప్టో కరెన్సీ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టిస్తానని నమ్మించి భారీగా డబ్బులు దోచుకున్నాడు. విదేశాల్లో ఉన్నట్లు చెప్పి బాధితులను మభ్యపెట్టినట్టు సమాచారం.
అతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదై ఉండగా, విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో చెన్నై ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, పలు డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరిన్ని నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
