Sunday, May 5, 2024
- Advertisement -

మృత‌దేహాన్ని పీక్కుతింటోన్న వ్య‌క్తి.. భయంతో వణికిపోయిన జనాలు

- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి కేసులు ఎంత ఘోరంగా పెరిగిపోతున్నాయో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కరోనా కేసులు దేశ వ్యాప్తంగా నాలుగు లక్షలకు చేరింది. ప్రతిరోజూ రెండు వేలకు పైగా మరణాలు సంబవిస్తున్నాయి. అయితే కరోనా మహమ్మారి ప్రభావంతో మానవ సంబంధాలు పూర్తిగా నశించిపోయాయి. సొంత వారికి కరోనా వచ్చినా.. చనిపోయినా పట్టించుకునే పరిస్థితి లేదు.

ఇటీవల పలు ఆసుపత్రుల్లో కరోనాతో చనిపోయిన వారిని తీసుకు వెళ్లేందుక సొంత వారు ఎవరూ రాలేదంటే పరిస్థితి ఎంత విషమించిందో అర్థం అవుతుంది. కరోనా సోకిన వారి దగ్గరకు వెళ్లాలంటేనే భయపడే ఈ రోజుల్లో ఓ వ్య‌క్తి మాత్రం అటువంటి శ‌వాన్నీ పీక్కుతింటుండ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఫల్టాన్ మున్సిపల్ పరిధిలోని ఓ శ్మశానవాటికలో జరిగింది.

ఈ దారుణమైన దృశ్యాలు కొంత మంది తమ స్మార్ట్ ఫోన్లో షూట్ చేశారు…సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. సతారా జిల్లాలోని ఫల్టాన్ మున్సిపల్ పరిధిలోని ఓ శ్మశానవాటికలో కరోనా మృతదేహాలకు అంత్య‌క్రియ‌లు చేసి సిబ్బంది శ్మ‌శాన వాటిక నుంచి వెళ్లిపోయాక‌ సగం కాలిన కరోనా మృతదేహాల అవయవాలను ఓ వ్యక్తి పీక్కు తింటున్నాడు. ఆ వ్యక్తి చేష్టలకు షాక్ తిన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో ఫల్టాన్ మున్సిపల్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. వారిని చూసి పారిపోయిన ఆ వ్యక్తి గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. సదరు వ్యక్తి మతిస్థిమితం సరిగా లేదని తెలుసుకున్నారు. అత‌డిని చికిత్స కోసం ఆసుప‌త్రికి తరలించామ‌ని, వైద్య నివేదికలు వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

నాని రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే!

టాలీవుడ్ హీరోయిన్లను దూరం పెడుతున్న ప్రభాస్.. కారణం అదేనా?

వామ్మో.. పుష్ప షూటింగ్ వెనుక అంత ప్లాన్ ఉందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -