Friday, April 26, 2024
- Advertisement -

టాలీవుడ్ హీరోయిన్లను దూరం పెడుతున్న ప్రభాస్.. కారణం అదేనా?

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించే సినిమాలలో ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్లకే ఆఫర్లు కల్పిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్, సలార్ సినిమాలలో టాలీవుడ్ హీరోయిన్లు నటించినప్పటికీ, ఆది పురుష్ చిత్రంలో మాత్రం బాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృతి సనన్ హీరోయిన్ గా చేస్తున్నారు. తెలుగులో ఈమె రెండు సినిమాల్లో నటించినప్పటికీ అవి డిజాస్టర్ గానే మిగిలిపోయాయి.

ఈ క్రమంలోనే ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో హీరోగా ఒక ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం వినబడుతోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించినున్నట్లు తెలుస్తోంది. కత్రినాకైఫ్ టాలీవుడ్ లో దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం వెంకటేష్ సినిమాల్లో నటించారు. అయితే ప్రస్తుతం ఈమెకు తెలుగులో పెద్ద ఆదరణ లేదనే చెప్పవచ్చు.

Also read:ప్రేమలో పడిన యాంకర్ వర్షిని.. ఫోటోలు వైరల్!

ప్రభాస్ నటించే సినిమాలలో టాలీవుడ్ యంగ్ హీరోయిన్లను పక్కనపెట్టి కత్రినా కైఫ్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకోవడం పట్ల అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్లను ఎంపిక చేస్తే బాగుంటుందని ప్రభాస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో దర్శకుడు ప్రభాస్ అభిమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారో.. లేదో వేచి చూడాలి.

Also read:ఆ సినిమా రీమేక్ చేస్తే.. బెల్లంకొండ బ్రదర్స్ పరువు పోతుంది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -