Monday, April 29, 2024
- Advertisement -

11 మందితో టీడీపీ మూడో జాబితా!

- Advertisement -

టీడీపీ మూడో జాబితాకు రంగం సిద్ధమైంది. టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తులో భాగంగా 144 ఎమ్మెల్యే,17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది తెలుగుదేశం పార్టీ. ఇప్పటివరకు రెండు జాబితాల్లో తొలి జాబితాలో 128 జనసేనతో కలిపి, రెండో జాబితాలో 16 మంది అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు. ఇక మిగిలిన అసెంబ్లీ స్థానాలకు పోటీ ఎక్కువగా ఉండటంతో తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

ఇక మూడో జాబితాలో 11 మంది ఎంపీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. మిగిలిన ఆరు ఎంపీ స్థానాలను పెండింగ్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి కేటాయించిన ఎంపీ నియోజకవర్గాల్లో కొన్నింటిని మార్పులు చేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.

టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం నంద్యాల – బైరెడ్డి శబరి,శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు,విశాఖ పట్టణం – ఎం. భరత్,అమలాపురం – గంటి హరీశ్,
విజయవాడ – కేశినేని శివనాథ్ (చిన్ని),గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్,నరసరావుపేట – లావు శ్రీకృష్ణ దేవరాయులు,ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు రెడ్డి,
నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్,అనంతపురం – బి.కె. పార్థసారథి ఉన్నారు. దీనిపై అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -