సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కి ముందే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు సీఎం జగన్. అభ్యర్థుల ఎంపికలో సోషల్ ఇంజనీరింగ్ పాటించిన వైసీపీ అధినేత, తాను బడుగుల పక్షపాతిని అని నిరూపించుకున్నారు. 175 అసెంబ్లీ,25 ఎంపీ స్థానాల్లో 50 శాతం అంటే 84 ఎమ్మెల్యేలు,16 ఎంపీ స్థానాలను బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలకు ఇచ్చారు. ఇందులో 19కి పైగా స్థానాలను మహిళలకు కేటాయించారు.
అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో ఇక మేనిఫెస్టో రిలీజ్పై దృష్టి సారించారు. ఈ నెల 20న వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ కానుందని సమాచారం. ఇప్పటికే మ్యానిఫెస్టో డ్రాఫ్ట్ పూర్తయినట్టు తెలుస్తోండగా జగన్ అమోదం తెలిపిన వెంటనే రిలీజ్ చేసే అవకాశం ఉంది.
డ్రాఫ్ట్ మేనిఫెస్ట్రోలో ఏ మైనా మార్పులుంటే పూర్తి చేసి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ. వైనాట్ 175 అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇందులో భాగంగానే మేనిఫెస్టో అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారని తెలుస్తోంది. మహిళలు, రైతులు,యూత్ని ఆక్టటుకునే పథకాలు ఉండనున్నాయని తెలుస్తోంది. మొత్తంగా వైసీపీ మేనిఫెస్టోపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.