Sunday, April 28, 2024
- Advertisement -

వైసీపీలో చేరిన అంబటి రాయుడు

- Advertisement -

ఎన్నికల వేళ వైసీపీలో చేరికల పర్వం కొనసాగుతోంది. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరారు. కొద్దికాలంగా ఏపీ రాజకీయాల్లో రాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతుండగా ఏ పార్టీ నుండి అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉండగా తాజాగా క్లారిటీ వచ్చేసింది.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు జగన్. కండువా కప్పి అంబటి రాయుడిని పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు జగన్. వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా అంబటి రాయుడు బరిలోకి దిగనున్నారు. మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది.

కొంతకాలంగా జగన్ సర్కార్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు రాయుడు. విద్యా రంగంలో సీఎం జగన్ తీసుకొచ్చిన మార్పులకు ఇంప్రెస్ అయ్యి తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. నాడు-నేడు, స్పోర్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవడం, పేద పిల్లలను పైకి తీసుకొచ్చే విషయంలో సీఎం జగన్ అత్యంత కృషి చేస్తున్నారని అందుకే వైసీపీలో చేరానని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -