Sunday, May 19, 2024
- Advertisement -

షర్మిల ఎంట్రీపై మంత్రి రోజా

- Advertisement -

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిలను నియమిస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపడితే తమకేం ఇబ్బంది లేదని తెలిపారు. ప్రజాస్వామ్యం లో ఎవరు ఎక్కడ నుంచి కూడా పోటీ చేయొచ్చని.. షర్మిలకు ఇదే వర్తిస్తుంది అన్నారు. షర్మిల రాక వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని…రాబోయేది జగనన్న సర్కారేనని తేల్చి చెప్పారు రోజా.

శ్రీపద్మావతి మహిళ యూనివర్సిటీలో ఇంటర్ స్టేట్ యూనివర్సిటీ ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన అనంతరం ఈ కామెంట్స్ చేశారు. ఇక చంద్రబాబుకు 175 సీట్లకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందన్నారు. కనీసం కుప్పం నియోజకవర్గం అయినా కాపాడుకోవాలని చంద్రబాబుకు సూచించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు … 40 ఏళ్లుగా కుప్పం ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు.

కుప్పంలో ప్రజలు చంద్రబాబును ఫుట్‌బాల్ ఆడటం ఖాయమన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు వెళ్తే సూసైడ్ చేసుకున్నట్లేనని… పదవులే పరమావధిగా ఉన్నవారు పార్టీలు మారితే భవిష్యత్ ఉండదన్నారు. ఆడుదాం ఆంధ్రాకు మంచి స్పందన వస్తోందన్నారు రోజా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -