ఎన్నికల వేళ టీడీపీకి గట్టి షాక్ తగిలింది. విశాఖపట్నంలో ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడగా తాజాగా బండారు సత్యనారాయణ పార్టీని వీడేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పెందుర్తి టికెట్ ఆశీంచారు బండారు. అయితే పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు బండారు.
దీంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోండగా దీనిపై ఆయన నో కామెంట్ అని చెప్పుకొచ్చారు. అయితే ఆయన అనుచరులు మాత్రం త్వరలో వైసీపీలో చేరడం ఖాయమని చెప్పుకొస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు బండారు సత్యనారాయణ మూర్తి మామ వరుస అవుతారు.
బండారుతో పాటు మరికొంతమంది నేతలు కూడా పార్టీ మారడం ఖాయమని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇక వైసీపీ ఇప్పటికే 175 అసెంబ్లీ,24 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఒక్క అనకాపల్లి స్థానాన్ని పెండింగ్లో పెట్టింది.