Tuesday, April 30, 2024
- Advertisement -

చంద్రగిరి నుండే భువనేశ్వరి నిజం గెలవాలి!

- Advertisement -

మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్, రిమాండ్‌ని నిరసిస్తూ నేటి నుండి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు ఆయన సతీమణి నారా భువనేశ్వరి. ఇవాళ ఉదయం 11.30 గంటలకు నారావారిపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి యాత్ర ప్రారంభిస్తారు. అనంతరం బాబు అరెస్ట్‌ని చూసి తట్టుకోలేకపోయి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు.

ఇక ఈ యాత్రకు నిజం గెలవాలి అనే పేరు ఖరారు చేయగా ఈ యాత్ర ద్వారా కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడమే కాకుండా సభలు, సమవేశాల్లో పాల్గొంటారు. ఇక రేపు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా చంద్రగిరిలో తొలి అడుగు వేస్తున్నాను అని ఎమోషనల్‌ అయ్యారు.

బాబు అరెస్ట్‌ని నిరసిస్తూ ప్రతీ శనివారం ఏదోరూపంలో నిరసన చేపడుతోంది టీడీపీ. ఇందులో భాగంగా అ శనివారం రాత్రి కాంతితో క్రాంతి కార్యక్రమానికి మళ్లీ పిలుపునిచ్చింది. ఇక భువనేశ్వరి యాత్రకు ఏ విధమైన స్పందన వస్తుంది…?ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారా అన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే భువనేశ్వరికి పెద్దగా రాజీకయ అనుభవం లేదు. దానికి తోడు ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడలేరు. ఒక ఎన్టీఆర్ కూతురు అనే ట్యాగ్ తప్ప రాజకీయాలు తెలియదు. ఈ నేపథ్యంలో భువనేశ్వరి చేపట్టిన ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు ఎలాంటి ఏర్పాట్లు చేశారో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -