టీడీపీకి షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే రెబల్ అభ్యర్థులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న టీడీపీకి ఇప్పుడు రాయలసీమలో గట్టి షాక్ తగలనుంది. ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో టికెట్ ఆశీంచి భంగపడ్డ నలుగురు నేతలు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
కేఈ ప్రభాకర్, తిక్కారెడ్డి,వైకుంఠం మల్లికార్జున చౌదరి, పత్తికొండ టికెట్ ఆశీంచిన పద్మజ పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలతో ఈ నలుగురు నేతలు సంప్రదింపులు జరపగా పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
టీడీపీకి రాజీనామా చేసి వీరంతా పార్టీలో చేరనుండగా ఇదే జరిగితే టీడీపీకి గట్టి దెబ్బే. పదేళ్ల పాటు తాను నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నానని, తాను గెలిచే అవకాశం ఉన్నప్పటికీ టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చేందుకు నిరాకరించందన్నారు తిక్కారెడ్డి. ఇండిపెండెంట్గా పోటీచేయాలని నేతలు ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీగా పనిచేసిన మసాల పద్మజా సైతం చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి బాటలోనే మరికొంతమంది నేతలున్నట్లు తెలుస్తోంది.