Thursday, May 2, 2024
- Advertisement -

టికెట్ రాకపోతే అంతే..బాబుకు టీడీపీ నేత హెచ్చరిక!

- Advertisement -

టీడీపీ ఫస్ట్ లిస్ట్ ఆ పార్టీలో అగ్గి రాజేసింది. పెద్ద ఎత్తున నేతలు పార్టీ అధినేత చంద్రబాబుపై తిరగబడుతున్నారు. కొంతమంది నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా మరికొంతమంది నేతలు మాత్రం చంద్రబాబుతో సమావేశంలో తమ నిర్ణయాన్ని నిర్మోహమాటంగా చెప్పారని తెలుస్తోంది.

ఇక టీడీపీ – జనసేన పొత్తులో 118 స్థానాలు ఫైనల్ కాగా మిగిలిన 57 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇందులో బీజేపీ కోటా పోతే టీడీపీ పోటీ చేసేది ఎన్ని అనేదానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. అయితే చంద్రబాబుకు ఇక్కడే అసలు సమస్య మొదలుకానుంది. ఎందుకంటే ఈ 57 నియోజకవర్గాల్లో కాంప్లీకేటేడ్ స్థానాలే ఎక్కువ.

ఇందులో పెనమలూరు ఒకటి. ఇక్కడి నుండి పోటీ చేసేందుకు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టికెట్ తనకే వస్తుందనే ఆశతో స్థానికంగా పనిచేసుకుంటూ వచ్చారు. అయితే తీరా ఇక్కడి నుండి పారాషూట్ నేతకు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు ప్రసాద్.

టికెట్ త‌న‌కే వ‌స్తుంద‌ని ఇందులో ఎలాంటి అనుమానాలు లేవ‌న్నారు. త‌న‌ను కాద‌ని టికెట్ ఇవ్వ‌బోర‌ని ఒక‌వేళ అదే జ‌రిగితే.. తాను చేతులు ముడుచుకుని కూర్చోన‌ని చంద్రబాబుకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. అవసరం అయితే రెబల్‌గా మారుతానని ప్రకటించారు. దీంతో టీడీపీకి ముందుంది అసలు సమస్య అని ఆ పార్టీ నేతలే చెబుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఫస్ట్ లిస్ట్‌ అసంతృప్తులను బుజ్జగించడం బాబుకు తలకు మించిన భారం కాగా మిగితా స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే రచ్చరచ్చ జరిగే అవకాశం లేకపోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -