Wednesday, May 8, 2024
- Advertisement -

చంద్రబాబు – పవన్..8న అయిన తేలుతుందా?

- Advertisement -

టీడీపీ – జనసేన మధ్య సీట్ల ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు ఒంటెద్దు పొకడతో విసిగిపోయిన పవన్..జనసేన సైతం రెండు స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు.దీంతో టీడీపీ – జనసేన మైత్రి బంధం మొదటికొచ్చింది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు – పవన్ ఆదివారం భేటీ కాగా ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి మధ్య దాదాపు మూడు గంటల పాటు చర్చ జరుపగా ఏం తేల్చలేకపోయారు. ఆ తర్వాత మళ్లీ భేటీ కాగా ఈ సారి జనసేన పోటీ చేసే సీట్ల సంఖ్య కొలిక్కి వచ్చిందని, అధికారిక ప్రకటనే తరువాయి అనుకున్నారు అంతా. కానీ సీన్ కట్ చేస్తే సేమ్ సీన్ రిపీట్ అయింది.

ఈ నెల 8న మరోసారి భేటీ కావాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. దీంతో ఈసారి జరిగే సమావేశంలోనైనా క్లారిటీ వస్తుందా వేచిచూడాలి. ప్రధానంగా విశాఖ, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేనకు కేటాయించే సీట్లపైనే ప్రతిష్టంభన నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాల్లో పోటీ చేసే స్థానాలపై ఏకాభిప్రాయం రాకపోవడంతో ఎలాంటి ప్రకటన చేయలేకపోతున్నారు. అయితే 8వ తేదీన జరిగే భేటీ తర్వాత స్పష్టమైన ప్రకటన ఉంటుందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నా…ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -