Sunday, April 28, 2024
- Advertisement -

ఆలస్యమైతే..అమృతం కూడా విషమే!

- Advertisement -

ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబులో ఎలాంటి ఛలనం లేదు. పార్టీ అభ్యర్థుల ఎంపిక, పోటీ చేసే స్థానాలపై నేతల నుండి ఎంత ఒత్తిడి వస్తున్నా మిన్నకుంటా ఉండిపోయారు చంద్రబాబు. ఇప్పుడు ఇదే టీడీపీ నేతల్లో టెన్షన్‌కు దారి తీస్తుండగా మరికొంతమందైతే పార్టీ అంతర్గత సమావేశాల్లో చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.

ఆలస్యం అమృతమైతే…కొన్ని సందర్భాల్లో విషంగా కూడా మారుతుందని టీడీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు.జనసేన, బీజేపీతో పొత్తు, సీట్ల సంఖ్య అంటూ కాలయాపన చేస్తే అది పార్టీనే నష్టం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇక ఇదే విషయాన్ని టీడీపీ అధినేతతో కొంతమంది నేరుగా చర్చించినట్లు సమాచారం. తమ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారని..కానీ తాము మాత్రం సైలెంట్ ఉండటం వల్ల నష్టం జరుగుతోందని వాపోయారట. ఇక కార్యకర్తలకు సైతం ఏం చెప్పాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టికెట్ల విషయంలో ఇలాగే కాలయాపన చేస్తే అసమ్మతి ఎలా సర్థుకుంటుందని సూటిగానే చెప్పారట.

అయితే నేతల అభిప్రాయాలను చంద్రబాబు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని ఎప్పుడు ఏం చేయాలో తనకు తెలుసని చెప్పారని టాక్ నడుస్తోంది. మొత్తంగా టీడీపీ లిస్ట్ ఎప్పుడు వస్తుందా అని తెలుగు తమ్ముళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే నేతల టెన్షన్ మాత్రం తగ్గడంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -