ఎన్డీయే కూటమిలో టీడీపీ చేరడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే ఏపీ నుండి జనసేన…ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉండగా తాజాగా ఎప్పుడెప్పుడు బీజేపీ పిలుస్తుందా అని ఎదురుచూస్తున్న చంద్రబాబుకు రావాల్సిన సమయం రానే వచ్చింది. ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు బాబు.
ఈ భేటీలో భాగంగా ఎన్డీయే కూటమిలో చేరాలని చంద్రబాబుకు ఆహ్వానించారు అమిత్ షా. దీంతో పార్టీ నేతలతో చర్చించి నిర్ణయాన్ని చెబుతానని తెలిపారు బాబు. అయితే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిందే బీజేపీతో స్నేహం కోసం. ఆ పని నెరవేరడంతో ఏపీకి వచ్చి అఫిషియల్గా ప్రకటించడమే తరువాయి అని భావిస్తున్నారు.
ఇక పవన్ కూడా ఢిల్లీ వెళ్తుండటంతో బీజేపీతో పొత్తులపై క్లారిటీ రానుంది. ఇవాళ చంద్రబాబు – పవన్ భేటీలో జనసేన – టీడీపీ పొత్తుపై అఫిషియల్ ప్రకటన రానుంది. ఈ సమావేశంలో బీజేపీతో పొత్తు, ఎన్ని సీట్లు ఇవ్వాలన్న దానిపై ఓ క్లారిటీకి రానున్నారు ఇద్దరు నేతలు. మొత్తంగ టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ చేరిక కన్ఫామ్ కాగా వైసీపీని ఏ విధంగా ఎదుర్కొంటారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే?