Sunday, May 19, 2024
- Advertisement -

టీడీపీతో వేస్ట్..బీజేపీ పవన్‌కు షాకివ్వనుందా?

- Advertisement -

ఏపీలో టీడీపీ -జనసేన కూటమిలో చేరికపై ఇంకా సందిగ్దం కొనసాగుతూనే ఉంది.సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపించేలా టీడీపీ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అన్న దానిపై రోజుకో వార్త వస్తూనే ఉంది. తాజాగా చంద్రబాబుతో కలిసేందుకు కాషాయ పార్టీ నేతలు విముఖత చూపిస్తున్నట్లు సమాచారం.

వాస్తవానికి బీజేపీ అగ్రనేతలు టీడీపీతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలను గమినిస్తే టీడీపీతో పొత్తుతో పెద్దగా ఉపయోగం లేదనే బీజేపీ భావిస్తోందట. ఎందుకంటే పొత్తులో భాగంగా ఒకటి రెండు సీట్లు తెచ్చుకున్న పెద్దగా ఉపయోగం ఉండదని అంచనాకు వచ్చారట.

ఎందుకంటే సర్వేలన్ని వైసీపీనే తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చిచెబుతుండగా అత్యధిక ఎంపీ స్థానాలు సైతం జగన్ పార్టీనే గెలవనుంది. అందుకే టీడీపీతో పొత్తు కంటే వైసీపీతోనే ముందుకు వెళ్తే బాగుంటుందని కొత్త ఎత్తుగడ వేశారంట బీజేపీ నేతలు. అందుకే ఎవరివైపు మొగ్గుచూపకుండా గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా సింగిల్ గానే వెళ్లాలని భావిస్తున్నారట. దీనివల్ల ఎన్నికల తర్వాత వైసీపీ మద్దతు అవసరమైతే తీసుకోవచ్చని భావిస్తున్నారట. అందుకే ఇప్పుడు ప్లాన్ బీతో ముందుకు వెళ్లేందుకు కమలనాథులు సిద్ధమయ్యారని టాక్.ఇందుకు సంబంధించి స్పష్టమైన ప్రకటన త్వరలోనే రానుందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -