ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్. అటు టీడీపీకి పవన్ హీరో అయితే కాగా వైసీపీకు మాత్రం విలనే. అందుకే టీడీపీ నేతలు పవన్ను భుజానికెత్తుతుంటే వైసీపీ నేతలు మాత్రం కారాలు మిరియాలు నూరుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఉండగా జనసేన – టీడీపీ నేతలకు పెద్ద దిక్కుగా మారారు పవన్. జనసేనాని సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.ఈసారి ఎలాగైన అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు అవసరమైతే బీజేపీతో రాంరాం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే ఇప్పుడు ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతుండగా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని స్థితిలో అంతా ఉన్నారు.
ఓ వైపు ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో చెప్పలేని పరిస్థితి. ఎన్నికల టైంలోనైనా బయటకు వస్తారా అంటే అది అంతుచిక్కని ప్రశ్నే. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెద్దన్న పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. తన దర్శకత్వంలో టీడీపీని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ నేతలు లోకేష్, బాలకృష్ణ ఫ్రంట్ ఎండ్లో ఉన్నా బ్యాక్ఎండ్లో కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా పవన్దే నటా.
ఎందుకంటే లోకేష్, బాలయ్య ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యాలు చేస్తారో ఊహించడం కష్టం. వీరిద్దరి నోటి దురుసు కారణంగా తొందరపడి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన టీడీపీకే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సైతం పవన్ దర్శకత్వంలోనే ముందుకు నడిచేందుకు సిద్ధమయ్యారట. ఇందుకోసం జనసేన – టీడీపీ మధ్య ఓ సమన్వయ కమిటీ ఏర్పాటుచేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ కమిటీకి కీలకంగా పవన్ మారనున్నారు.
అయితే ఇంతవరకు బాగానే ఉన్న పవన్ నాయకత్వంలో నడిచేందుకు కొంతమంది టీడీపీ నేతలు జంకుతున్నారు. పవన్ మార్గదర్శకత్వంలో నడిస్తే టీడీపీ మరో జల్సాలా ఫ్లాప్ని మూటగట్టుకోవడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏపీ విభజన తర్వాత పవన్ రాజకీయ ఎత్తుగడలు ఎప్పుడు ఫ్లాప్గానే మిగిలాయి తప్ప సక్సెస్ అయిన దాఖలాలు లేవు. అందుకే పవన్ నేతృత్వంలో పనిచేసేందుకు విముఖత చూపుతున్నారట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీకి పవన్ డైర్తెక్షన్ ఆ పార్టీకి ఎంతవరకు ఉపయోగ పడుతుందో అంటే అంతుచిక్కని ప్రశ్నేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది.