- Advertisement -
సిద్ధం సభల తర్వాత సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ నెల 16 నుండి ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభించనుండగా ఇవాళ జరిగే అద్దంకి సిద్ధం సభలో మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. నవరత్నాలకు తోడు మరిన్ని ప్రజాకార్షక స్కీంలు ఉండే అవకాశం ఉంది.
ఇక సెంటిమెంట్ అయిన ఉత్తరాంధ్ర నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించనుండగా 26 జిల్లాల్లో రోడ్ షోలు, సభలు నిర్వహించనున్నారు. ఇక రోజుకు కనీసం 3 నియోజకవర్గాల్లో జగన్ సభలు ఉండనున్నాయి. తర్వాతి నుండి రోజూ నాలుగైదు నియోజకవర్గాల్లో వైసీపీ సభలు ఉండనున్నాయి.
వైసీపీ సిద్ధం సభలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇవాళ నిర్వహించనున్న అద్దంకి సభకు దాదాపు 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సభలో సీఎం జగన్ కీలక ప్రకటన చేయనున్నారని సమాచారం.