Saturday, May 18, 2024
- Advertisement -

ఇకపై రోజుకు నాలుగు బహిరంగసభలు!

- Advertisement -

ఏపీ ఎన్నికల ప్రచారానికి మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో దూకుడు పెంచారు ఏపీ సీఎం జగన్. ఇప్పటివరకు మేమంతా సిద్ధం బస్సుయాత్ర ద్వారా రోజుకు రెండు, మూడు సభల్లో పాల్గొని ప్రసంగించారు. అయితే సమయం దగ్గర పడుతుండటుంతో స్పీడ్ పెంచారు.

గురువారం నుండి రోజుకు నాలుగు బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు జగన్. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఇవాళ విడుదల కానుంది. ఈ పదిరోజుల పాటు విస్తృత పర్యటన ఉండటమే కాదు వైసీపీ మేనిఫెస్టోను ఇంటింటికి చేర్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రెడీ చేశారు.

వీలైనన్ని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేసేలా జగన్ ప్రచార రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. జగన్ జైత్రయాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు స్వచ్చందంగా తరలివస్తున్నారు. ఇక ఈ ఐదేళ్ల పాలనలో ఏం చేశారో వివరిస్తున్న జగన్, చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏం జరగబోతుందో చెప్పి వారిలో చైతన్యం నింపుతున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఏఏ పథకాలు అమలు చేయబోతున్నామో ప్రజలకు వివరిస్తు ముందుకు సాగుతున్నారు. ఈనెల 13న పోలింగ్ జరగనుండగా.. 11వ తేదీ సాయంత్రం వరకు ప్రచారానికి తెరపడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -