Saturday, April 27, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌తో లోకేష్‌కు పోలికా!

- Advertisement -

ఎన్టీఆర్ పై ప్రేమ ఉన్నవారు చంద్రబాబు, లోకేష్ కి ఓటువేయరన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. నిజమైన వారసులకు టిడీపీని అప్పగించాలని సవాల్ విసిరారు. ఏపీలో బీజేపీ తొత్తులకు బుద్ధి చెప్పాలన్నారు. ఒక్క సభకు ఇన్ని వందల కోట్లు ఖర్చుపెట్టారని ఎద్దేశా చేశారు.

ఉత్తరాంధ్రలో చంద్రబాబు, పవన్ మీటింగ్ కు వందమందైనా డబ్బులు ఇవ్వకుండా వచ్చారా? ఆలోచించాలన్నారు. లోకేశ్ కు మాటలు రావు.. సీనియర్ ఎన్టీఆర్ కి లోకేశ్ కు ఏమైనా పోలిక ఉందా ఆలోచించాలన్నారు. ఇక ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు పాల్. ముఖ్యమంత్రి కావాల్ని చంద్రబాబు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని… గుంటూరు, గుడివాడ టికెట్ల కోసం ఎన్ఆర్ఐ నుంచి కోట్లు తీసుకున్నాడని ఆరోపించారు.

చంద్రబాబు సీఎం అయితే అవినీతి ఆంధ్ర అవుతుందని …తంలో చంద్రబాబు ఉద్యోగాలు కల్పించలేదు.. ఇప్పుడు 60 లక్షల మంది నిరుద్యోగులున్నారు.. వారికి ఎలా ఉద్యోగాలు ఇస్తారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు 68,700 కోట్ల హామీలు ఇచ్చారు.. మాటలురాని లోకేశ్ ఏం చేస్తాడుంటూ ఎద్దేవా చేశారు. లోకేశ్ పాదయాత్రలో తారకరత్న చనిపోయారు.. సీబీఐ, సీఐడీ దర్యాప్తు కు చంద్రబాబు సిద్ధమా అంటూ పాల్ ప్రశ్నించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -