Tuesday, April 30, 2024
- Advertisement -

టీడీపీకి షాక్..వైసీపీలోకి కేఈ!

- Advertisement -

టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే రాయచోటికి చెందిన మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి టీడీపీని వీడి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరగా తాజాగా కర్నూల్‌ మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్‌ వైసీపీలో చేరికకు రంగం సిద్ధమైంది.

టీడీపీ తరపున పత్తికొండ,డోన్ లేదా ఆలూరు టికెట్ ఆశీంచారు. కానీ ఆయనకు తీవ్ర నిరాశే ఎదురైంది. అనేక సందర్భాల్లో తన టికెట్‌కు సంబంధించి చంద్రబాబుతో చర్చలు కూడా జరిపారు. కానీ ఒకే కుటుంబానికి ఒకే టిక్కెట్టు అంటూ ఆయనకు సీటు నిరాకరించడంతో పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చారు కేఈ.

పత్తికొండ టికెట్‌ను మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కే శ్యామ్‌బాబుకు టీడీపీ కేటాయించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రభాకర్ …వైఎస్‌ఆర్‌సీపీ నేతలతో ప్రభాకర్‌ టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే టీడీపీకి గట్టి దెబ్బే. కొన్ని దశాబ్దాలుగా కేఈ కుటుంబం రాజకీయాల్లో ఉంది. కర్నూల్ ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వీరి ప్రాబల్యం ఉంది. ఒకవేళ కేఈ పార్టీ మారితే అది టీడీపీకి కొలుకోలేని దెబ్బే అని అంతా భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -