Saturday, May 4, 2024
- Advertisement -

బండికి షాక్..సిట్టింగ్‌లకు సీట్లు డౌటే!

- Advertisement -

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలకు సీట్లు ఇవ్వాలనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన కిషన్ రెడ్డి..సిట్టింగ్‌లకు సీటు గ్యారెంటీ అని ఎక్కడా చెప్పలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కమిటీలు వేస్తున్నామని తెలిపారు. ఇక అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు ఉండదని ప్రకటించారు.

ఇక కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్‌తో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని భావిస్తున్న సిట్టింగ్ ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్ ఖంగుతిన్నారు. ఎందుకంటే వీరిద్దరూ రీసెంట్‌గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తుండగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. బీజేపీలో ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉన్నారు. వాస్తవానికి అసెంబ్లీ బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా ఓటు శాతం మాత్రం కాస్త పెరిగింది. దీనికి తోడు మోడీ బొమ్మతో గెలవడం ఖాయమని భావిస్తున్న నేతలకు కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్‌ ఖచ్చితంగా షాకేనని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -