Saturday, May 4, 2024
- Advertisement -

టీబీజేపీలో భారీ ప్రక్షాళన..ఆ వర్గానికే పెద్దపీట!

- Advertisement -

పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ భారీ ప్రక్షాళన చేపట్టింది. 12 మంది జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర మోర్చాల అధ్యక్షులను మార్చేసింది. తాజాగా మార్చిన జిల్లా అధ్యక్షులంతా కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వర్గానికి చెందిన వారే కావడం విశేషం.

ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా కల్యాణ్ నాయక్ ను, ఎస్సీ మోర్చాకు మాజీ ఎంఎల్ఏ కొండేటి శ్రీధర్, యువ మోర్చాకు సేవెల్ల మహేందర్, ఓబీసీ మోర్చాకు ఆనంద్ గౌడ్, మహిళా మోర్చాకు డాక్టర్ శిల్పను కిషన్ రెడ్డి నియిమించారు. ఇక జిల్లా అధ్యక్షుల విషయానికొస్తే…మహబూబ్ నగర్ జిల్లాకు పీ శ్రీనివాసరెడ్డి, వరంగల్ కు గంటరవి, నారాయణపేట జిల్లాకు జలంధర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కులాచారి దినేష్ కుమార్, పెద్దపల్లికి చందుపట్ల సునీల్, సంగారెడ్డికి గోదావరి, సిద్ధిపేటకు గంగడి మోహన్ రెడ్డి, యాదాద్రి, భువనగిరికి పాశం భాస్కర్, వనపర్తికి డీ నారాయణ, వికారాబాద్ కు మాధవరెడ్డి, నల్లగొండకు డాక్టర్ వర్షిత్ రెడ్డి, ములుగుకు బలరాంని నియమించారు.

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు కిషన్ రెడ్డి. అయితే అంతా కొత్తవారే కావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుల మార్పు ఏ మేరకు కలిసివస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -