ఏపీలో ఇప్పుడు అన్నిపార్టీల టార్గెట్ వైఎస్ జగన్. ఆయన్ని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలన్ని ఏకమయ్యేలా కనిపిస్తున్నాయి.ఇక ఇప్పటికే టీడీపీ – జనసేన పొత్తు కన్ఫామ్ కాగా ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా అని అంతా భావించారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.ఇక తాజా పొలిటికల్ పరిస్థితులను గమనిస్తే టీడీపీ – జనసేన కూటమిలో కాంగ్రెస్తో పాటు వామపక్షాలు చేరే పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది.
జగన్ వ్యతిరేకులు ఎవరితో అయనా చేతులు కలుపుతాం అని లోకేష్ ప్రకటించిన తర్వాత మిగితా పార్టీల్లో కూడా చలనం వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనతో ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.అయితే ఏ పార్టీ కాంగ్రెస్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ – కాంగ్రెస్లకు పరస్పర సహకారం అవసరం ఏర్పడింది. అందుకే కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి..లేటుగా అయినా ఘాటుగా స్పందించారు. బాబు అరెస్ట్ వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో టీడీపీ – కాంగ్రెస్ మధ్య పొత్తు వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ కూటమిలో లెఫ్ట్ పార్టీలు కూడా చేరే అవకాశం ఉందని టాక్. మొత్తంగా మహాకూటమిగా జగన్ని ఎదుర్కొనేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి..