- Advertisement -

ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు!

- Advertisement -

ప్రచండ భానుడి భగభగతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకోవడంతో జనం బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఉక్కపోత, చెమటలతో అల్లాడుతున్న ప్రజలకు మరియు వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు వాతావరణ శాఖ ఒక శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయం కంటే ముందుగానే భారతదేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి.

యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్స్ (ECMWF) మరియు వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం, ఈ సారి మే నెలాఖరు నాటికే వర్షాలు పలకరించనున్నాయి.మే 18 – 25 మధ్య: అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది.మే 25 – జూన్ 1 మధ్య: రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకవచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణంగా జూన్ 1న కేరళకు వచ్చే రుతుపవనాలు, ఈసారి 3-5 రోజులు ముందుగానే వచ్చే అవకాశం ఉంది.

నైరుతి దిశ నుండి వీచే బలమైన గాలులు దక్షిణ బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రంపై ఇప్పటికే బలపడుతున్నాయి. దీనివల్ల సాధారణం కంటే 30 నుంచి 60 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం మే నెలాఖరులోనే నమోదయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ప్రస్తుతం వాతావరణంలో ‘ఎల్ నినో’ ప్రభావం తగ్గి, పరిస్థితులు సానుకూలంగా మారుతుండటం మరో సానుకూల అంశం.

రళలోకి రుతుపవనాలు ముందుగా ప్రవేశిస్తే, ఆ తర్వాత వారం లేదా పది రోజుల్లోనే అవి తెలుగు రాష్ట్రాలను తాకుతాయి. మే నెలలో ఉండే రోహిణి కార్తె ఎండల నుంచి జూన్ మొదటి వారంలోనే ఉపశమనం లభించే అవకాశం ఉంది. రుతుపవనాలు సకాలంలో వస్తే ఖరీఫ్ సీజన్ సాగు పనులను రైతులు ముందుగానే ప్రారంభించవచ్చు.

తొలకరి వర్షాలు జూన్ మొదటి వారంలోనే పలకరించే వీలుంది. భారత వాతావరణ శాఖ (IMD) ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే స్వల్పంగా తక్కువగా ఉండవచ్చని గతంలో సూచించినప్పటికీ, రుతుపవనాల రాక (Onset) విషయంలో మాత్రం ముందస్తు సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. మే చివరి వారంలో ఐఎండి ఇచ్చే అప్‌డేటెడ్ రిపోర్ట్‌తో వర్షాల తీవ్రతపై మరింత స్పష్టత రానుంది.మొత్తానికి, భానుడి భగభగలకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడబోతోంది. మే నెలాఖరు నుంచే చల్లని చినుకులు పలకరించే సూచనలు కనిపిస్తుండటంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -