Monday, April 29, 2024
- Advertisement -

నాగబాబు..ఈసారైన అదృష్టం కలిసివచ్చేనా?

- Advertisement -

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో మెగా బ్రదర్ నాగబాబు పాలిటిక్స్‌లో తిరిగి యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల్లో నరసరావు పేట నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు నాగబాబు. ఆ తర్వాత అడపదడపా జనసేన కార్యక్రమాల్లో తప్ప పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్‌లో పాల్గొంది లేదు.

కానీ ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో జనసైనికులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో నాన్ లోకల్ ముద్రతో ఓడిపోయిన నాగబాబు…ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తన మాకంను హైదరాబాద్ నుండి ఎలమంచిలికి మార్చారు.

ఈసారి అనకాపల్లి నుండి నాగబాబు ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు నిజం చేకూరేలా నియోజకవర్గ పరిధిలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. అయితే నాగబాబు ఎలమంచిలికి మకాం మార్చిన నాన్ లోకల్ అనే ముద్రనే మాత్రం చెరపలేకపోతున్నారు. కేవలం కులం ప్రాతిపదికనే పోటీ చేస్తున్న మెగాబ్రదర్ నాగబాబుకు ఈసారైనా అదృష్టం కలిసి వస్తుందా లేదా అన్నది వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -