Saturday, May 4, 2024
- Advertisement -

వైరల్..ఏపీ బీజేపీకి కొత్త చీఫ్!

- Advertisement -

ఏపీలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తుండగా కాంగ్రెస్ సైతం కొత్త ఇంఛార్జీని నియమించింది. ఇక తాజాగా ఇప్పుడు ఏపీ బీజేపీకి కొత్త చీఫ్ రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

సొంత పార్టీ నేతల నుండి విమర్శలు ఎదుర్కొంటున్న పురందేశ్వరిని మారుస్తారని బీజేపీ నేతలే ప్రచారం చేస్తున్నారు. పురందేశ్వరి స్థానంలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డిని నియమిస్తారని సమాచారం.
వాస్తవానికి ఈ ఏడాది జూలైలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమె బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి ఆశించిన స్ధాయిలో పార్టీ కార్యక్రమాలు, పురోగతి లేదని అధిష్టానం ఆలోచన.

దీనికి తోడు తన వర్గానికి చెందిన వారికే పెద్దపీట వేస్తున్నారని సీనియర్లు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఆమెను అధ్యక్షురాలిగా తొలగించాలని డిమాండ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ కార్యాచరణ కూడా సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కొత్త అధ్యక్షుడి పేరు తెరపైకి రాగా ప్రముఖంగా కిరణ్ కుమార్ రెడ్డి, బీసీ వర్గానికి చెందిన సత్య కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. మి త్వరలోనే కాషాయ పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారా లేక పురందేశ్వరినే కొనసాగిస్తారా వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -