ఏపీ రాజకీయాలు పిఠాపురం చుట్టే తిరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి పిఠాపురంపైనే ఉంది. పవన్ను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా వైసీపీ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తోంది. పవన్ కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం ఒకవైపు అయితే మరోవైపు మండలాల వారీగా ఇంఛార్జీలను నియమించి భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి వంగ గీత గెలుపొందేలా వ్యూహాలను సిద్ధం చేసింది. ఇక వైసీపీ వ్యూహానికి మాజీ మంత్రి ముద్రగడ కూడా తోడు కావడంతో వంగా గీత గెలుపు నల్లేరుపై నడకేనని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
ఇక పవన్ సైతం ఈసారి ఎలాగైన అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం ఫైట్ ఆసక్తికరంగా మారగా తాజాగా సోషల్ మీడియాలో పవన్ ఆస్తులకు సంబంధించిన న్యూస్ వైరల్గా మారింది. సాధారణంగా ఎన్నికల అఫిడవిట్లో పవన్ ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తారు. కానీ ఇప్పుడు పవన్ ఆస్తుల చిట్టాకు సంబంధించిన న్యూస్ మాత్రం చర్చనీయాంశంగా మారింది.
పవన్ కల్యాణ్ మొత్తం ఆస్తుల విలువ రూ.57 కోట్లు అని అలాగే అప్పులు రూ..34 కోట్ల వరకూ ఉన్నాయట. వివిధ బ్యాంకుల్లో ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్లు, బాండ్లు రూ.6 కోట్లు ఉన్నాయని అలాగే మరో రూ.3 కోట్లు సేవింగ్స్ ఉన్నాయని..హైదరాబాద్ శివారులో 18 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు హైదరాబాద్లో 4 ఇళ్లు, మంగళగిరిలో రెండు ఇళ్లు ఉన్నాయి. వీటి విలువ రూ.34 కోట్లు. రష్యాలోనూ ఆయనకు ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది. వీటి మొత్తం విలువ రూ.1.75 కోట్లు అన్న న్యూస్ చర్చనీయాంశంగా మారింది.