టీడీపీ – జనసేన..గెలుపే ప్రామాణికం. నైతికత, రాజకీయ విలువలు అంటూ ఏమి లేవు. ఇక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పనక్కర్లేదు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్ప పవన్..ఇందుకోసం ఎంతకైనా దిగజారేందుకు వెనుకడటం లేదని అంతా భావిస్తున్న పరిస్థితి నెలకొంది.
ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే పవన్ అంటే ప్యాకేజీ స్టార్, చంద్రబాబు దత్త పుత్రుడు అనే ముద్రపడింది. ఇప్పుడు దానిని సాకారం చేసుకుంటూ బీజేపీతో బంధానికి బ్రేకప్ చెప్పేందుకే సిద్ధమయ్యారు పవన్. వాస్తవానికి టీడీపీ కంటే ముందు బీజేపీతో కలిసి పోటీ చేసేందుకే ఇష్టపడ్డారు పవన్. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరారు కూడా.
కానీ ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ అయ్యాడో అప్పుడే పవన్ తన బుద్దిని బయటపెట్టారు. బీజేపీకి కటీఫ్ చెప్పి టీడీపీతో అంటకాగారు. తర్వాత బీజేపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. ఇక తాజాగా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే బీజేపీతో జనసేనాని రాంరాం చెప్పడం దాదాపు ఖాయమైంది. ఈ నెల 8 తర్వాత పరోక్షంగా ఇందుకు సంబంధించిన స్టేట్ మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. మరి పవన్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా కలిసివస్తుందో లేదో వేచిచూడాలి.