Monday, April 29, 2024
- Advertisement -

చంద్రబాబుకు షాకిచ్చిన పీకే!

- Advertisement -

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు తుగులుతున్నాయి. ఓ వైపు అభ్యర్థుల ఎంపిక చంద్రబాబుకు తలకు మించిన భారం కాగా మరోవైపు జనసేనతో పొత్తులో సీట్లు కొల్పోతున్న టీడీపీ నేతల నుండి తీవ్ర ఒత్తిడి వెరసీ అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబుకు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ ఎదురుకాలేదు. ఇక తాజాగా పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ షాకిచ్చారు.

కొంతకాలంగా టీడీపీకి అనుకూలంగా ప్రశాంత్ కిషోర్ పనిచేయనున్నారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలు సైతం బహిరంగంగానే ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక నారా లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ కలిసి రావడంతో అంతా పీకే…టీడీపీ తరపున ప్రచారం చేయడం కన్ఫామ అని భావించారు. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు ప్రశాంత్ కిషోర్.

ఓ హిందీ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన పీకే… చంద్రబాబును కలవడానికి తాను విజయవాడకు వెళ్లానని తెలిపారు. తనకు, చంద్రబాబుకు ఉన్న ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా బాబును కలవాల్సి వచ్చిందని..ఆ కామన్ ఫ్రెండ్ ఓ బిగ్ పొలిటికల్ షాట్ అని తెలిపారు. చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి కలవాలని తనపై ఒత్తిడి తెచ్చారని అందుకే విజయవాడ వెళ్లానని తెలిపారు. 2019 ఎన్నికల్లో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశానని, ఆ పార్టీ విజయం సాధించిందని, అందుకే ఈ సారి టీడీపి కోసం పని చేయాలంటూ ఆ కామన్ ఫ్రెండ్ ద్వారా ఒత్తిడి తెచ్చారని వివరించారు. అయితే ప్రస్తుతం తాను రాజకీయ వ్యూహకర్తగా పని చేయట్లేదనే చంద్రబాబుకు తేల్చి చెప్పానన్నారు. ఏపీ ఎన్నికల్లో ఏ రకంగా కూడా తాను జోక్యం చేసుకోవట్లేదని, తన పాత్ర ఏమీ లేదని చెప్పారు. దీంతో ఇప్పటివరకు టీడీపీ నేతలు చేసిన ప్రచారం అంతా ఉట్టిదే అని తేలిపోయింది. ఇక సర్వేల్ని వైఎస్ జగన్‌కే మొగ్గు చూపుతుండటంతో ఈసారి కూడా బాబు అండ్ టీంకు పరాభవం తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -