తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో దూకుడుగా వెళ్తున్నారు. తనదైన శైలీలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలో రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ సీఎం జగన్ బాటలోనే నడుస్తున్నాయి. ఎందుకంటే పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు జగన్. ముఖ్యంగా జగన్ తీసుకొచ్చిన ప్రధాన సంస్కరణ వాలంటీర్లు. జనాభా ప్రాతిపదికన ప్రతి 50 మందికి ఒక వాలంటీర్ని తీసుకొచ్చి ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు చేరవేయడంలో సక్సెస్ అయ్యారు జగన్.
తాజాగా ఇప్పుడు రేవంత్ సైతం ఇదే బాటలో వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే జగన్లా ప్రతీ 50 మందికి కాకుండా వేల సంఖ్యలో జనాలకు ఒక వాలంటీర్ ఉండేలా ముందుకుసాగుతున్నారు. ఇందుకు సంబంధించి ఓ స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
పాలనలో పారదర్శకత ఉండేలా రేవంత్ కార్యాచరణ ఉండనుందట. నేరుగా ఏ ప్రభుత్వ పథకమైనా లబ్దిదారులకే చేరేలా అధికారులను సైతం సిద్ధం చేస్తున్నారట జగన్. అలాగే ఉద్యోగాల నియామకాలు,పింఛన్లు ఇలా ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీల విషయంలోనూ పారదర్శకత ఉండేలా జగన్నే ఫాలో అవుతున్నారు రేవంత్ రెడ్డి.