- Advertisement -

600 ఏళ్ల పురాతన ఆల‌యాన్ని కాపాడండి!

- Advertisement -

నగరిలోని 600 ఏళ్ల పురాతన ఆలయాన్ని కాపాడాలని మాజీ మంత్రి ఆర్కే రోజా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీను కలిసి ప్రత్యేకంగా అభ్యర్థించారు. ఈ సమావేశంలో ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, గుమ్మ తనూజరాణి పాల్గొన్నారు.

సుమారు 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ప్రస్తుతం రహదారి అభివృద్ధి పనుల కారణంగా తొలగించే పరిస్థితి ఎదుర్కొంటోందని రోజా తెలిపారు. వందల ఏళ్లుగా ఈ దేవాలయం స్థానిక ప్రజల విశ్వాసానికి కేంద్రంగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో ప్రత్యేకంగా 21 దేవతామూర్తుల విగ్రహాలను తీసుకువచ్చి, గ్రామస్తులు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారని వివరించారు. ఈ వేడుకలు ఆ ప్రాంత సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా ఉంటాయని చెప్పారు.

ఇలాంటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న ఆలయాన్ని కాపాడాలని గడ్కరిని కోరామని రోజా వెల్లడించారు. అభివృద్ధి పనులు అవసరమే అయినా, వారసత్వ సంపదను కాపాడటం కూడా అంతే ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. అభివృద్ధి మరియు సంస్కృతి మధ్య సమతుల్యత అవసరమని, ఈ ఆలయాన్ని రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -