Saturday, May 4, 2024
- Advertisement -

తగ్గిన బాబు..ఆ స్థానాల్లో అభ్యర్థుల మార్పు!

- Advertisement -

టీడీపీ అసంతృప్తుల ఒత్తిడికి తలొగ్గారు చంద్రబాబు. ఎంత బుజ్జగించిన కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులు ససేమీరా అనడంతో చివరికి వారి ఒత్తిడి తలొగ్గారు బాబు. 5 స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది.

అయితే అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. కానీ కొంతకాలంగా పార్టీలో అసమ్మతి భగ్గుమన్న నేపథ్యంలో అభ్యర్థుల మార్పు ఖాయమని ప్రచారం జరుగుతుండగా అనుకున్నట్లుగానే 5 స్థానాల్లో మార్పు, మరో రెండు స్థానాల్లో బీ ఫామ్‌ని పెండింగ్‌లో పెట్టారు.

ఉండి స్థానం నుంచి ఇప్పటికే ప్రకటించిన రామారాజును తప్పించి రఘురామ రాజు పేరు ఖరారు చేశారు. మాడుగుల అభ్యర్దిగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ,పాడేరులో గిడ్డి ఈశ్వరికి ,మడకశిర స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్ రాజు బరిలోకి దిగనున్నారు.

అలాగే వెంకటగిరి స్థానాన్ని తొలుత కురుగొండ రామకృష్ణ కుమార్తెకు ఇవ్వగా తాజాగా రామకృష్ణ పేరునే ప్రకటించారు. అదే విధంగా దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థులకు బీ-ఫారాలు పెండింగులో పెట్టినట్లు సమాచారం. అనపర్తి సీటు టీడీపీకి ఇస్తే తంబళ్లపల్లె లేదా దెందులూరు బీజేపీ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతుండగా దీనిపై ఒకటి,రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -