Tuesday, May 7, 2024
- Advertisement -

టీడీపీలో వర్గపోరు…తల పట్టుకున్న బాబు!

- Advertisement -

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది టీడీపీలో వర్గ విభేదాలు రోజుకోటి బయటపడుతున్నాయి. ఓ వైపు జనసేనతో సీట్ల సర్దుబాటు ఒక ఎత్తైతే మరోవైపు సొంత పార్టీలోనే నేతల మధ్య వైరంతో చంద్రబాబు తల పట్టుకుంటున్నారు. తాజాగా టీడీపీకి కంచుకోట లాంటి ఉండి నియోజకవర్గంలో వర్గపోరు తారాస్థాయికి చేరడం టీడీపీ నేతలను కలవరపెడుతోంది.

ఉండి టీడీపీకి కంచుకోట. ఎంత ప్రతీకూల పరిస్థితిలోనూ టీడీపీ గెలిచిన సందర్భాలే ఎక్కువ. ఇక 2019లో వైసీపీ గాలిలోనూ జిల్లాలో రెండు స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఇందులో ఉండి ఒకటి. 2019లో టీడీపీ నుండి మంతెన రామరాజు ఎమ్మెల్యేగా గెలవగా ఇప్పుడు ఆయనకు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు నుండి గట్టిపోటీ ఎదురైంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఉండి టికెట్ కోసం కొట్టుకునే పరిస్థితి నెలకొంది.

ఇప్పటివరకు ఉండిలో శివరామరాజు ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్నే మంతెన రామరాజు వాడుతూ వస్తుండగా తాజాగా ఆ కార్యాలయాన్ని ఖాళీ చేసి ఎమ్మెల్యే మరోచోట టీడీపీ ఆఫీస్‌ను ఓపెన్‌ చేశారు.దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా సేవా కార్యక్రమాల పేరుతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈసారి పోటీలో ఉంటానని తేల్చి చెబుతుండటంతో ఎమ్మెల్యే రామరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఉండి పాలిటిక్స్‌ శివరామరాజు వర్సెస్‌ రామరాజు అన్నట్లు తయారైంది. మొత్తంగా ఉండి వర్గపోరును చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారోనని టీడీపీ కేడర్‌ ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -