34 మందితో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో జాబితాను రిలీజ్ చేశారు. ఇక చంద్రబాబు రెండో జాబితా ప్రకటించారో లేదో అప్పుడు రాజీనామాలు షురూ అయ్యాయి. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి టీడీపీకి రాజీనామా చేశారు. విశాఖ సౌత్, మాడుగుల టికెట్ ఆశీంచారు బాబ్జీ కానీ చంద్రబాబుకు టికెట్ కేటాయించలేదు.
ఇక అలాగే మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్కు నిరాశే ఎదురుకాగా టీడీపీని ఓడించి తీరుతామని ఆయన అనుచరులు తేల్చిచెప్పారు. ఇక గంట శ్రీనివాస్ తొలి నుండి భీమిలి సీటు కోసం పట్టుబడుతున్నారు. అయితే చంద్రబాబు ససేమీర చెబుతు రాగా సెకండ్ లిస్ట్లో కూడా ఆయన పేరు లేదు. దీంతో అనుచరులతో సమావేశమైన గంటా త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
చాలామంది సీనియర్లకు నిరాశే ఎదురైంది. ఎచ్చెర్ల కోసం పట్టుబడుతున్న కళా వెంకట్రావు పేరు రెండో జాబితాలో లేదు. అలాగే చీపురుపల్లి కోసం కిమిడి నాగార్జున, పెందురు సీటును బండారు సత్యనారాయణకు ఇచ్చేందుకు చంద్రబాబు నిరాకరించారు. కొవూరులో పోలంరెడ్డికి షాక్ ఇచ్చారు బాబు. వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎంపీ వేమిరెడ్డి భార్యకు కొవూరు టికెట్ ఇచ్చారు. ఇక మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడికి ఎంపీ టికెట్ ఇవ్వలేదు బాబు.