తెలంగాణ బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే విజయసంకల్ప యాత్రతో తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు బీజేపీ నేతలు. ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతుండగా ఫస్ట్ లిస్ట్పై దృష్టి సారించారు బీజేపీ నేతలు. త్వరలోనే 10 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఈజీగానే జరుగగా మరికొన్ని స్థానాల్లో మాత్రం పీటముడి నెలకొంది.
ఇక గత లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్లను గెలుచుకుంది బీజేపీ.అయితే ఈ సారి 10 ఎంపీ స్థానాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ అంకె సెంటిమెంటో ఏంటో తెలియదు గానీ అదే 10 నెంబర్తో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
నలుగురు సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టికెట్లు ఖరారయ్యాయి. సికింద్రాబాద్ – జి.కిషన్రెడ్డి, కరీంనగర్ – బండి సంజయ్, నిజామాబాద్ – ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ – సోయం బాపూరావు, చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్రెడ్డి, భువనగిరి – బూర నర్సయ్యగౌడ్, వరంగల్ – కృష్ణప్రసాద్, మెదక్ – ఎం.రఘునందన్రావు, హైదరాబాద్ – రాజాసింగ్, పెద్దపల్లి – మంద కృష్ణ మాదిగ, మహబూబ్నగర్ – డీకే అరుణ పేర్లు ఖరారు అయినట్లు సమాచారం.
ఇక మిగిలిన ఏడు స్థానాలకు నేతల పోటీ ఎక్కువగా ఉంది. ప్రధానంగా మల్కాజ్గిరి స్థానం కోసం పి.మురళీధర్రావు,ఈటల రాజేందర్, మల్క కొమురయ్య పేర్లు వినిపిస్తుండగా మురళీధర్ రావు లేదా కొమురయ్యలలో ఒకరు ఖరారయ్యే అవకాశం ఉంది.