ఎన్నికల నోటిఫికేషన్కు సమయం దగ్గర పడుతున్న కొద్ది టీడీపీలో అసమ్మతి ఏమాత్రం చల్లారడం లేదు. పొత్తులో భాగంగా 141 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది టీడీపీ. అయితే ఇంతవరకు బాగానే కొన్ని స్థానాల్లో టికెట్ దక్కని నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందురు రెడీ అవుతున్నారు.
అసమ్మతులను బుజ్జగించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించకపోవడంతో కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.బీజేపీకి కేటాయించిన స్థానాల్లో మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. కడప, నర్సాపురం ఎంపీ స్థానాలతో పాటు, ఉండి,జమ్మలమడుగు, వనపర్తి,తంబేర్లపల్లి వంటి స్థానాల్లో అభ్యర్థులను మార్చబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దీంతో పాటు మాడుగుల, చింతలపూడి, మడకశిర, సిల్లూరుపేట, సత్యవేడు స్థానాల్లో అభ్యర్థులను మార్చనున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక రఘురామ టీడీపీలో చేరగా ఆయన అసెంబ్లీకి పోటీ చేయనున్నారు.