Monday, April 29, 2024
- Advertisement -

కుప్పంలో గెలిచేది జగనే..తెగేసి చెబుతున్న ప్రజలు!

- Advertisement -

బైబై బాబు..కుప్పం నుండే ప్రారంభం అవుతుందని సీఎం జగన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఎందుకంటే 1989 నుండి కుప్పం బరిలో నిలుస్తూ వస్తున్న చంద్రబాబు విజయం సాధిస్తూనే ఉన్నారు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా,14 ఏళ్లు సీఎంగా ఉన్నా కుప్పానికి చేసిన అభివృద్ధి ఏం లేదని స్థానకులు అభిప్రాయపడుతున్నారు.

ఎమ్మెల్యే కాకుండానే భరత్ కుప్పం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని, ఎమ్మెల్యే అయి మంత్రి అయితే మరింత అభివృద్ధి చేస్తాడని కుప్పం ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈసారి మా ఓటు జగన్‌, వైసీపీ అభ్యర్థి భరత్‌కేనని కుండబద్దలు కొడుతున్నారు.

రీసెంట్‌గా కుప్పంలో పర్యటించిన సీఎం జగన్‌…బలహీన వర్గాల ప్రతినిధిగా భరత్ ను ఎమ్మెల్సీగా చేశానని తెలిపారు. అంతేగాదు కుప్పం నుండి ఈసారి భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తానిన హామీ ఇచ్చారు. దీంతో వైసీపీ శ్రేణులు ఈసారి కుప్పంను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకుసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నట్లుగానే కుప్పం అసెంబ్లీలో బాబును ఓడించేందుకు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -