Monday, April 29, 2024
- Advertisement -

కాంగ్రెస్‌లో చేరిన వైఎస్ షర్మిల

- Advertisement -

వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉందన్నారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో పార్టీ చేరారు షర్మిల. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల..రాహుల్ గాంధీని ప్రధాని చేయడం మానాన్న వైఎస్ కల దానిని తప్పకుండా నెరవేరుస్తామన్నారు.

ఇవాళ్టి నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణలో పోటీ చేయలదేన్నారు. కాం గ్రెస్ పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచనా లేకుండా కృషి చేస్తానన్నారు. వైఎస్ తన జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారని..ఆయన అడుగు జాడల్లోనే నడుస్తానని తెలిపారు.దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాం గ్రెస్ అన్నారు.

రాహుల్ భారత్ జోడోయాత్రతో కర్ణాటకలో కాం గ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రాహుల్ భారత్ జోడోయాత్ర తనలో స్పూర్తి నింపిందన్నారు. దేశంలోనే అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్ అన్నారు. షర్మిలతో పాటు ఆమె భర్త అనిల్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -