ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు వైఎస్ షర్మిల. విజయవాడ, కానూరులోని కల్యాణ మండపంలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల..ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీకి రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని… రాజధాని కట్టడానికి డబ్బుల్లేవు అని ఆరోపించారు.
దళితులపై దాడులు వంద శాతం పెరిగాయని… బీజేపీ అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కానీ పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు పదిహేనేళ్లు కావాలని అడిగారు…బీజేపీతో పొత్తు పెట్టుకొని సీఎం అయ్యాక, కేంద్ర మంత్రి పదవులు పొందాకా ఒక్క ఉద్యమం అయినా చేశారా? ఆలోచించాలన్నారు.
వైఎస్ బిడ్డగా నాకు ఏపీసీసీ బాధ్యతలు అప్పచెప్పడం గర్వకారణంగా ఉందన్నారు. నన్ను నమ్మి బాధ్యతలు అప్పచెప్పడం సంతోషంగా ఉందన్నారు. నేను రావాలని కాంగ్రెస్ కు పనిచేయాలని ఎంతోమంది త్యాగాలు చేశారని…బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని నిప్పులు చెరిగారు.