నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కాంబోలో ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో సింహా, లెజెండ్, అఖండ సూపర్ డూపర్ హిట్గా నిలిచాయి. అఖండ తర్వాత బాలయ్య – బోయపాటి సినిమాపై ప్రచారం జరిగింది. దీంతో బాలకృష్ణ ఫ్యాన్స్ ఆనందానిక అవధుల్లేకుండా పోగా తాజాగా మరోసారి చర్చ జరుగుతోంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కనుండగా ఏప్రిల్లో సినిమాకు సంబంధించి క్లారిటీ రానుందని తెలుస్తోంది. ఉగాది పండగ సందర్భంగా సినిమా ఓపెనింగ్ ఉంటుందని తెలుస్తోంది. అయితే షూటింగ్ మాత్రం ఎన్నికలు పూర్తయ్యాక ప్రారంభం కానుందని టాక్.
అయితే వీరిద్దరి కాంబోలో వచ్చే ఈ నాలుగో సినిమా అఖండ 2నా లేక వేరే కథతో వస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. స్కంద డిజాస్టర్ తర్వాత బోయపాటి శీను…బాలయ్యతో సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ చివరి దశ పనుల్లో ఉండగా కథ పూర్తి కాగానే ఫైనల్ నెరేషన్ కు రెడీ కానున్నట్లు సమాచారం.