కొరటాల శివ, బోయపాటి శ్రీను ఈ ఇద్దరు డైరెక్టర్లు ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరూ దర్శకులు రైటర్ కం డైరెక్టర్ పోసాని కృష్ణమురళీ శిష్యులే. అయితే ఈ ఇద్దరు డైరెక్టర్లకు సింహా చిత్రం టైంలో గ్యాప్ వచ్చింది. సింహా సినిమాకి బోయపాటి డైరెక్ట్ చేయగా.. కొరటాల కూడా పనిచేశాడు. అయితే సింహా సినిమా టైటిల్స్లో కొరటాల పేరు లేదు. . ఆ కథ, మాటలు తనవే అని అయితే బోయపాటి ఆ క్రెడిట్ తనకు దక్కకుండా చేశాడని కొరటాల పదే పదే ఆరోపణలు చేస్తున్నాడు.
అయితే ఈ వివాదం వెనక నాడు అసలు సెటిల్మెంట్ ఎలా జరిగింది అన్న అంశంపై ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్లో కొత్త టాక్ ఇప్పుడు చర్చకు వచ్చింది. నాడు వీరిద్దరి మధ్య గొడవకు కారణమైన సంఘటన వెనక ఆసక్తికరమైన సంఘటనే జరిగినట్టు తెలుస్తోంది. సింహా చిత్రంకు స్టోరీ రాయడానికి కొరటాల రెడీ అన్నాడట. అయితే ఆ ఆ చిత్రంకు కొరటాలతో పాటు మరి కొందరు రైటర్లతో కూడా బోయపాటి వర్క్ చేయించాడట. అయితే సింహాకి కంప్లీట్గా కథ రాసిన రైటర్ ఎవరనే విషయంలో క్లారిటీ మిస్సయింది.
దీంతో ఎవరి పేరు వేయాలో అర్ధం కాక.. కథ-స్క్రీన్ప్లే-మాటలు-దర్శకత్వం అన్ని బోయపాటి తన పేరే వేసుకున్నాడట. అయితే కొరటాల తన పేరు వేయమని గట్టిగా అడిగిన.. బోయపాటి మాత్రం చాలా మంది రచయితలు పని చేసినందున తాను ఎవ్వరి పేరు వేయలేనని.. బేసిక్ ఐడియా తనదే కాబట్టి తన పేరే వేసుకుంటానని గట్టిగానే చెప్పాడట. ఇక సింహ చిత్రంకు కొరటాల పనిచేసినందుకు గాను… రూ.7 లక్షలు బోయపాటి రూ.1.5 లక్షల చొప్పున మూడు చెక్కులు ఇచ్చి రెండు నెలల్లో రూ.6 లక్షల వరకూ క్లియర్ చేశాడట. సో.. ఇలా ఈ ఇద్దరి మధ్య సెటిల్మెంట్ అయ్యింది.
Related